ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్ర చంద్రనం స్మగ్లింగ్‌ అంటే ఎవరికైనా టీడీపీ గుర్తుకొస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 08:56 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల్లోనే పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా, వైయస్ఆర్‌సీపీ లక్ష్యంగా ఈనాడులో ఒక అబద్ధపు కథనం రాయించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి మండిపడ్డారు. నిజానికి ఎర్ర చంద్రనం స్మగ్లింగ్‌ అంటే ఎవరికైనా టీడీపీ గుర్తుకొస్తుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ పాల వ్యాన్లలోనే ఆనాడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేసిన ఘనత వారి సొంతమని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి  సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa