ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 08:58 PM

ఏపీలో కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నేతలను ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రి అమర్నాథ్‌ అన్నారు. అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైయ‌స్ఆర్‌సీపీ  చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.   దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa