ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆందోళనకు దిగిన వాలంటీర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 09:45 PM

తమ సమస్యలను పరిష్కరించాలంటూ గాంధీనగర్ ధర్నా చౌక్‌లో సోమవారం వాలంటీర్లు ఆందోళనకు దిగారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ... 2.60 లక్షల మంది వాలంటీర్లుగా పని చేస్తున్నామని.. ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. మహిళలకు అధర్మం జరగకూడదన్న పాలకులే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆరు మాసాలుగా జీతాలు కూడా పెండింగ్‌లో పెట్టి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు అండగా ఉంటామని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా సమస్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు స్పందించాలి.. మా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి’’ అని వాలంటీర్లు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa