ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:26 PM

మంగళగిరి ఎయిమ్స్‌‌ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆయూష్, ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , సత్య కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.960 బెడ్లు ఉన్న ఆసుపత్రి... రూ. 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి.. మంగళగిరి ఎయిమ్స్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారని, ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని, అవకాశం ఉంటే తనకు ఇక్కడ చదువుకోవాలని ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిమ్స్ మంగళగిరికి ఎలాంటి మౌళిక సదుపాయాల లోటు ఉండనివ్వమని సీఎం స్పష్టం చేశారు. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నామన్నారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్‌గా మారిపోయిందని, డీప్ టెక్‌ను మెడికల్‌లో కూడా అమలు చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa