తొలగించిన హెల్పర్ (ఆయా) సౌజన్యను విధుల్లోకి తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. రాజకీ య నాయకులు చెప్పిన మాటలు విని ఆయాను విధులు నుంచి తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. అన్ని అర్హతలు ఉన్నాయని ఉద్యో గం ఇచ్చిన ఐసీడీఎస్ అధికారులు.. ఇప్పుడు అర్హతలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నా రు. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధిం పులు పాల్పడడం సరికాదన్నారు. అక్కడ నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటికి ర్యాలీగా వెళ్లే సమయంలో పూలే విగ్రహం వద్ద డీఎస్పీ తన సిబ్బందితో అడ్డుకున్నారు. మంత్రి స్థానికంగా లేరని ఐసీడీఎస్ పీడీని తీసుకుని వస్తామని చె ప్పడంతో అక్కడ నుంచి తిరిగి కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గం టల సమయంలో పీడీ శాంతికుమారి అక్కడ వచ్చి కొంతమంది నాయకులను కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వద్ద తీసుకువెళ్లి మాట్లాడించారు. దీని స్పందించిన కలెక్టర్ జేసీతో విచారణ చే యిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమిం చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఉమా మహేశ్వరి, వి.లక్ష్మి, పైడి రాజు, అనసూయ, సురేష్, టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa