ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఫైబర్ నెట్ లో ఎన్నో అవకతవకలు జరిగాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 02:41 PM

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని.. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని.. అంటే ఒక్కో వ్యూస్‌కు 11 వేలు చెల్లించినట్లు అయ్యిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయ్యిందన్నారు.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారును చేసిన సంస్థకు మెయింటెనెన్స్‌ పేరుతో వేలకోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని.. పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్‌లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa