ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుణదల ఉత్సవాలకు ప్రభుత్వం సహకరిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 04:13 PM

ఫిబ్రవరిలో నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ్‌ కౌన్సిల్‌ సభ్యులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.


పలు సమస్యలు కౌన్సిల్‌ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులపై ప్రభుత్వ సహకారం కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానన్నారు. మేరీమాత పుణ్యక్షేత్రం రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు ప్రత్యేక ప్రార్థన చేసి ఎంపీని ఆశీర్వదించారు. గుణదల చర్చి అధ్యక్షుడు నువ్వుల విజయబాబు, ఉపాధ్యక్షుడు చెరుకూరి జోసఫ్‌, కోశాధికారి గోలి విజయానంద్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa