ఈమధ్య కాలంలో అనేక మంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అమాయక మహిళలపై పడి తమ కోరిక తీర్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో భయం కల్గించేలా ఓ నేరస్థుడికి శిక్ష వేసింది కేరళలోని ఓ ఫాస్ట్ట్రాక్ కోర్టు. ముఖ్యంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా రూ1.05 లక్షల జరిమానాను కూడా విధిస్తూ తీర్పునిచ్చింది. నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోతే మరో ఏడాది ఎక్కువగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్ వేద్దాం రండి.
కేరళ తిరువనంతపురంకు చెందిన 44 ఏళ్ల మనోజ్ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. అలాగే ఇంటి వద్ద సాయంకాలం పూట ట్యూషన్లు కూడా చెప్పేవాడు. 8వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు చదువుకునే విద్యార్థులంతా ఇతడి వద్దకు ట్యూషన్ కోసం వచ్చే వారు. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలిక కూడా ట్యూషన్కు వచ్చింది. అయితే ఆమెపై కన్నేసిన మనోజ్ ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. ఇంట్లో భార్య లేని సమయం చూసి బాలికకు.. స్పెషల్ క్లాస్ ఉందని చెబుతూ ట్యూషన్కు రమ్మన్నాడు.
అతడి మనసులోని కోరిక గురించి తెలియని బాలిక.. ఉపాధ్యాయుడు చెప్పగానే ట్యూషన్కు వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే మనోజ్ ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపులు వేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఫొటోలు కూడా తీశాడు. ఎవరికైనా చెబితే వాటిని అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడు. ఎలాగోలా ఇల్లు చేరుకున్న బాలిక దాని గురించి తలుచుకుంటూ బాధ పడుతూనే ఉంది. అంతలోనే మనోజ్ బాలిక ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో భయపడిపోయిన బాలిక విపరీతంగా ఏడవడంతో.. తల్లిదండ్రులు మెల్లిగా జరిగిన విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ట్యూషన్ టీచర్ మనోజ్ను అరెస్ట్ చేశారు. ఆపై అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 2019లో ఈ ఘటన జరగగా.. కేసు నడుస్తూనే ఉంది. అయితే తాజాగా తిరువనంతపురంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. మనోజ్ ఫోన్లో బాలిక చిత్రాలు ఉండడం గమనించింది. అలాగే తాను నేరం చేయలేదని.. అత్యాచారం జరిగిన సమయంలో తాను ఆఫీసులో ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు మనోజ్.
కానీ ఆయ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అత్యాచార సమయంలో అతడు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించి కోర్టుకు వివరాలు తెలిపారు. మనోజ్ నేరం చేసినట్లు ఆధారాలతో సహా ప్రూవ్ చేశారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్యూషన్ టీచర్కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే లక్షా 5 వేల రూపాయల జరిమానా విధించింది. నిర్ణీత గడువులోగా ఆ డబ్బులు కట్టకపోతే మరో ఏడాది పాటు ఎక్కువ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో బాధితురాలి తల్లిదండ్రులు సహా స్థానికులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa