రేనాటి చంద్రుడిగా ఖ్యాతికెక్కిన ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి చేసిన దాన దర్మాల చరిత్ర, ఆయన సేవలు నేటి తరానికి అందించాల్సిన అవసరం ఎంతో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బనగానపల్లిలోని మంత్రి కార్యాలయంలో ‘రేనాటి చంద్రుడు’ పుస్తకం (నవల) ఆయన ఆవిష్కరిం చారు. పుస్తక రచయిత, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబు లయ్య పుస్తకంలో బుడ్డా వెంగళరెడ్డి జీవిత విశేషాలను, ఆయన చేసిన దానధర్మాలను మంత్రికి వివరించారు. ఈ సంద ర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్న కాలంలో జిల్లాలో డొక్కల కరువుగా మారిందని, అప్పుడు బుడ్డా వెంగళరెడ్డి గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్నార్థులకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆనాడు ప్రజలకు అందించిన సేవలను ఈనాటి తరానికి తెలియజేసేలా పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం అభినందనీమని పుస్తక రచయిత పత్తి ఓబులయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం ఉపాధ్యక్షుడు సీవీ రెడ్డి, బనగానపల్లె అరుణభారతి సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa