ప్రయాగ్రాజ్లో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. జనవరి 13న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 27 వరకు 45 రోజుల పాటు కొనసాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 40 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. వారం రోజుల్లో మొదటి షాహీ స్నానంతో కుంభమేళా ప్రారంభం కానుండగా.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కుంభమేళా జరుగుతోన్న ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందిందని ప్రయాగ్రాజ్లోని ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అఖాడాలు ఏర్పాటుచేసిన స్థలం కూడా తమదేనని వాదిస్తున్నారు.
ముస్లింల వాదనల ప్రకారం 54 బిఘాలు (దాదాపు 34 ఎకరాలు) భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. ఆ భూమిలో ముస్లింల ప్రవేశాన్ని నిరోధించలేమని, అది వారికే చెందుతుందని బోర్డు గట్టిగా చెప్పింది. అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ... వక్ఫ్ స్థలంలో ఇంతటి ఉత్సవం నిర్వహించేందుకు ముస్లింలు అనుమతించి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారని అన్నారు... హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఈ కార్యక్రమానికి తమను అనుమతించాలని ఆయన కోరారు.
ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాకు సాధువులు, ఆధ్యాత్మిక గురువులతో సహా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంక్యలో తరలిరానున్నారు. కుంభ మేళా ప్రదేశాన్ని మొతత్తం 25 విభాగాలుగా విభజించారు. ఇందులో 14 ప్రయాగ్రాజ్ నుంచి 9 కి.మీ. దూరంలోని ఝున్సీ వద్ద ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రయాగ్రాజ్లోకి కేసీ పంత్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పిన స్థలం కూడా వక్ఫ్ బోర్డుకే చెందుతుందునేది మరికొందరి వాదన. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్లోనే కుంభ్ ఆర్కైవ్ సెంటర్ స్థాపించారు. కుంభమేళా నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటుచేసిన అధికారులు.. ఆటోమేటిక్ నెంబరు ప్లేటు రికగ్నిషన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. దీని ద్వారా వాహనాల రియల్ టైమ్ను పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, యాంటీ-డ్రోన్ వ్యవస్థ, అండర్వాటర్ కెమెరాలను కూడా ఏర్పాటుచేసినట్టు మహాకుంభ సీనియర్ ఎస్పీ రాజేశ్ ద్వివేది అన్నారు.
మరోవైపు, యాత్రికులు, భక్తులను కుంభ మేళాలకు తరలించేందుకు రైల్వే శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకకు 13 వేల రైళ్లు నడపాలని రైల్వే నిర్ణయించింది. వీటిలో 10 వేలు రెగ్యులర్ సర్వీసులు కాగా.. 3 వేల ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. మేళా జరగడానికి 2-3 రోజుల ముందు.. ఆ తర్వాత 2-3 రోజుల వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa