పొగ మంచు ప్రాణాలు తీస్తోంది.. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై తాజాగా.. మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొని..ఇద్దరు మరణించారు.. ఎదురుగా వెళ్తున్న బస్సును.. వెనుకనుంచి వస్తున్న మరో బస్సు ఢికొట్టింది.. ఈ ప్రమాదం సూర్యాపేట SV ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర చోటుచేసుకుంది.. NH65 మలుపు దగ్గర ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టుకున్నాయి. యోలో ట్రావెల్స్ బస్సును.. జింగ్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.. ప్రమాదం ధాటికి జింగ్ ట్రావెల్స్ బస్సు ఎదుట అద్దంలో నుంచి క్లీనర్ ఎగిరి బస్సు కింద పడ్డాడు.. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.. మృతుడు క్లీనర్ సాయిగా గుర్తించారు.. అయితే.. యోలో బస్సులో కూడా మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతిచెందాడు.. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి.. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పొగమంచు, అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే.. గుండెపోటుతో మరణించిన వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa