ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం జిల్లాలో భారీ దొంగతనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 02:34 PM

అనంతపురం జిల్లాపై దొంగల ముఠా పంజా విసిరింది. వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కదిరిలో రెండు రోజుల క్రితం భారీగా దొంగతనం జరిగింది. ఆ ఘటన మరవక ముందే అనంతపురం నగరంలో దొంగల ముఠా చెలరేగిపోయింది. పెళ్లి కోసం దాచిన డబ్బులు, నగలను దుండుగులు అపహరించడంతో ఆ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. అయితే దొంగతనం చేసే ముందు దుండగులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రీ ప్లాన్డ్‌గానే దొండగులు ఇంత భారీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దుండగులకు పట్టుకునేందకు ప్రత్యేక బృందాలను నియమించారు. దొంగలను పట్టుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు.రెండు రోజుల క్రితం కదిరిలో ఓ టీచర్ ఇంట్లో రూ.50 లక్షల వరకు దొంగల ముఠా దోచుకెళ్లారు. ఇంతలోనే అనంతపురం నగర శివారులోని రాజహంస రెసిడెన్సీలోని మూడు ఇళ్లలో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఆ కాలనీలో ఎవరూ లేని ఇళ్లను ఎంచుకున్న దుండగులు.. వారి ఇళ్లలోనే చోరీకి తెగబడ్డారు. ఈ క్రమంలో పెళ్లి కోసం ఇంటిలో లాకర్లో దాచుకున్న కోటి రూపాయలు విలువైన బంగారు వజ్రాభరణాలు, రూ.25 లక్షల నగదును దొంగలు అపహరించారు. రాజహంస రెసిడెన్సీలోనే మరొక విద్యుత్ అధికారి, ఎక్సైజ్ ఉద్యోగిని ఇంట్లో కూడా చోరీ చేశారు దుండగులు. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని దొంగతనం జరిగిన ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చోరీకి పాల్పడ్డ రాజహంస రెసిడెన్సికి సమీపంలోనే ఎస్వీఆర్ఎస్ హైట్స్ సమీపంలో దొంగల రెక్కీ విజువల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రత్యేక బృందాలతో దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa