ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో సహకరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 02:35 PM

దావోస్‌ సదస్సు వేదికగా దిగ్గజ కంపెనీల అధినేతలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ వరుస సమావేశాలు నిర్వహించారు. పెట్టుబడులకు తమ రాష్ట్రం గమ్యస్థానమంటూ కంపెనీలను ఏపీకి ఆకర్షించేందుకు ప్రయత్నించారు. తెలిపారు. ఏపీలో సమర్థవంతమైన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కోసం హైవోల్టేజి డైరెక్ట్‌ కరెంట్‌(హెచ్‌వీడీసీ) వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో సహకరించాలని హిటాచీ ఇండియా ఎండీ భరత్‌ కౌశల్‌ను మంత్రి కోరారు. వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టు, గ్రీన్‌ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మూడు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల (కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం) ఏర్పాటుకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. భరత్‌ కౌశల్‌ స్పందిస్తూ.. ఇప్పటికే జాన్సన్‌ కంట్రోల్స్‌, హిటాచీ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, కాకినాడలో బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించిందని, త్వరలో అనంతపురం, బొబ్బిలిలో మరో రెండు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2018లో ఏపీలో మూడు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లను నిర్మించేందుకు హిటాచీ ఇండియా కాంట్రాక్టులను పొందిందని, త్వరలో వీటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ గ్లోబల్‌ చైర్మన్‌ జాన్‌ డ్రూను లోకేశ్‌ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa