బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ విత్తనం పేగుల్లోని పురుగులు, బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, మీరు బొప్పాయి గింజలను కూడా తీసుకోవాలి. బొప్పాయి గింజలు తీసుకోవడం వల్ల రుతుక్రమంలో నొప్పి తగ్గుతుంది.బొప్పాయి గింజల్లోని కొన్ని పదార్థాలు మన బాడీలోని టాక్సిన్స్ని బయటికి పంపుతాయి. దీంతో మన బాడీ క్లీన్ అవుతుంది. కాలేయ పనితీరు మెరుగవుతుంది. నానబెట్టిన బొప్పాయి గింజల నీటిని తాగితే బాడీ, కాలేయ సమస్యలు తగ్గుతాయి. పరగడపునే ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. బొప్పాయి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఇమ్యూనిటీని బలంగా చేసి ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయి గింజలు జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సాఫీగా ఉంచుతాయి. దీని వల్ల మలబద్ధకం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు మీ ఆహారంలో బొప్పాయి గింజలను చేర్చుకుంటే, అవి మీ రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.. కొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది.
బొప్పాయి గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. మీరు ఈ విత్తనాలను కూడా తినాలి. బొప్పాయి గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం, జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.బొప్పాయి గింజల తీసుకుంటే ఊబకాయ సమస్య తగ్గుతుంది. ఈ గింజల నీటిని పరగడపున తాగితే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీని వల్ల జీర్ణశక్తి, జీవక్రియకి మంచిది. మొత్తం బరువుని కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa