చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పారదర్శకతకు పాడె కట్టి రహస్య జీవోలతో పాలన సాగిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆక్షేపించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి కూడా పారదర్శక ప్రభుత్వం అని ఎలా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తాను నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి తానేం తక్కువ తినలేదని నిరూపించుకున్నాడన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రహస్య జీవోలన్నీ కూడా కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సెల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం వెన్నుపోటుతో పెట్టిన విద్య అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన రహస్య జీవోల్లో కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖకు సంబంధించి 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి 4, ఆర్థికశాఖకు చెందినవి 5, ఇరిగేషన్కి 6, హోంశాఖకు 4 జీవోలు ఇచ్చారని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa