జగన్మోహన్రెడ్డి ఐదేళ్లగా రాష్ట్రంలో విధ్వంసపాలన చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడని రాష్ట్ర లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. మంగళవారం ఆయన గిద్దలూరులోని యడవల్లిలో ఏర్పాటు చేసిన లెదర్పార్కును చూసేందుకు వెళుతూ మార్గమధ్యలో ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో లిడ్క్యాప్లను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో శ్రీకాకుళం నుంచి తడ వరకు రాయలసీమ ప్రాంతాలలో అనేక చోట్ల స్థలాలు తీసుకున్నారన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లిడ్క్యాప్ భూములను అనేక చోట్ల అన్యాక్రాంతం అయ్యాయ న్నారు. గుంటూరు జిల్లా అడిగొప్పలలో దాదాపు 20 ఎకరాలు జగనన్న కాలనీ పేరుతో ఆక్రమించారన్నారు. తాను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి వైసీపీ ఆక్రమించుకున్న భూములన్నింటిని పరిశీలించామన్నారు. జగనన్న కాలనీ పేరుతో ఆక్రమించుకున్న స్థలాల్లో ఎక్కడైనా ఇళ్లు కట్టకుండా ఉంటే చర్యలు తీసుకోవడంతోపాటు కోర్టులో కేసులు వేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేసే చర్మకారుల అభివృద్ధి, వారి జీవనోపాధి విషయంలో ప్రణాళిక సిద్దం చేస్తున్నామ న్నారు. అందులో భాగంగానే లెదర్పార్కు స్థలాన్ని పరిశీలించి ఏవిధంగా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తా మన్నారు. గత ప్రభుత్వ వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతం శ్రీనివాసులు, ప్రసన్న, ఎంఆర్పీఎస్ నాయకులు షాలెంరాజు, జయరాజ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa