కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఈ కేంద్ర మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు వెళ్తుండగా, ప్రయాణిస్తున్న కాన్వాయ్లో అనుకోని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం షీలానగర్లో మంత్రులు ప్రయాణిస్తున్న కాన్వాయ్లో మొత్తం ఎనిమిది వాహనాలుండగా.. మూడు కార్లు ఒకదానితో మరొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నారాయణ రావు కారు ధ్వంసమైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే సిబ్బంది జీవీఎల్ కారును పక్కకు తీయగా.. మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రయాణం కొనసాగించారు. ఘటన తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్కు వచ్చిన కేంద్ర మంత్రులను ఏపీలోని అధికార కూటమి నేతలు ఘనంగా స్వాగతించారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు బయల్దేరిన మంత్రుల కారు కాన్వాయ్లో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై స్పీడ్గా వెళ్తున్న క్రమంలో ఒక కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా.. వెనుకున్న కారు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో స్థానికంగా కొంత అలజడి రేగింది. అయితే, కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో బీజేపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa