జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలతో వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత చిత్రపటానికి వైయస్ఆర్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో దేశంలో ఎన్నో కులాలు, బాషలు, ప్రాంతాలు ఉన్నా మనమంతా భారతీయులనే భావనతో స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి పోరాడాం. సాధించుకున్నాం. ఆ మహాత్ముడి అడుగుజాడల్లో ముందుకెళుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను దేవుడిలా కొలుస్తున్నారు. అహింస అనే ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఆయన ఉద్యమించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మహాత్మాగాంధీ మరోసారి జన్మిస్తే బావుటుందని భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మన రాష్ట్రంలో అధికారమే పరమావధిగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టే మాటలు, హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఎవరు ఏం చేయలేరన్న బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. మా నాయకులు వైయస్ జగన్ మ్యానిఫెస్టోని పవిత్ర గ్రంధంలా భావించి ముందుకెళ్ళారు. అమలు చేసి చూపారు. మహాత్ముని ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వైయస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ మహాత్ముని ఆశయాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళుతుంది` అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అంకంరెడ్డి నారాయణమూర్తి, మస్తాన్ వలీ, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం.మనోహర్ రెడ్డి, పార్టీ నాయకుడు సుదర్శన్ రెడ్డి, సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa