కాందహార్ : దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ ప్రావిన్స్ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి కార్యాలయం అధికారులు.. గడిచిన 30 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. వరదల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారన్న యూఎన్వో.. మరో పది మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వరదలతో 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, శుక్రవారం నుంచి దాదాపు 400 కుటుంబాలను సైనికులు రక్షించినట్లు కాందహార్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. అటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్న అధికారులు భారీ వర్షాలు ఆటంకం కలిగిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa