ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 11:56 AM

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో అక్కడ ఏర్పాటు చేసిన పలు టెంట్లు కాలిపోయాయి.అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన ఈ కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా గత నెల 29వ తేదీన కుంభమేళా ప్రాంతంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఇక కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి వరకూ అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది నాలుగోసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com