ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 11:01 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పట్టు వదలని విక్రమార్కుడిని పని చేస్తున్నారు. గతంలో అమెరికా పీఠం అధిష్టించిన ఆయన పనామా కాలువను కొనుగోలు చేయాలని కలలు కన్నారు. కానీ అది తీరకముందే పదవిని కోల్పోయారు. కానీ తాజాగా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈసారి కచ్చితంగా పనామా కాలువను కొనాలని చూస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన కొంత మేరకు పంతం నెగ్గించుకున్నారు. ముఖ్యంగా ట్రంప్ పట్టుదల చూసిన పనామా కాస్త వెనక్కి తగ్గి మరి అమెరికా యుద్ధ నౌకలు పనామా కాలువపై నుంచి ప్రయాణిస్తే ఎలాంటి ఫీజును తీసుకోమని చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికా రక్షణ మంత్రి హెగ్సే తాజాగా పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా హెగ్సేనే వివరించారు. తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు పమానా కాలువపై ప్రయాణిస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాము పెట్టిన షరతుకు ఆదేశం ఒప్పుకుందని వివరించారు. దీని వల్ల అమెరికా ప్రభుత్వ నౌకలకు పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయని చెప్పుకొచ్చారు. అలాగే అక్రమ వలసదారులపై కూడా పమానా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందని వెల్లడించారు.


ఇదంతా నిజమేనంటూ అమెరికా విదేశాంగ కూడా ధ్రువీకరించింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ మరీ.. అమెరికా యుద్ధ నౌకలు పనామా కెనాల్‌పై ప్రయాణిస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. అయితే చాలా రోజుల క్రితమే పనామా.. యూఎస్‌కు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రూబియో తెలిపారు. కానీ ఇరు దేశాల మధ్య ఒప్పందాల నేపథ్యంలో ఫ్రీగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.


1914లో అట్లాంటిక్ -పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికానే పనామా కాలువను నిర్మించింది. నౌకాయన భారం తగ్గించేందుకు నిర్మించిన ఈ కెనాల్ నిర్వహణను కూడా యూఎస్‌యే చూసుకునేది. కానీ పనామా దేశంలో ఈ విషయమై తీవ్ర ఆందోళన చెలరేగగా.. 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ కాలువను పనామాకు అప్పగించింది. అయితే ఏవైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు పనామా కాలువను రక్షించుకునే హక్కు యూఎస్‌కు ఉందంటూ ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.


అయితే ఆ తర్వాత కాలంలో పనామా కూడా ఆ కాలువను రక్షించుకునేందుకు పెద్ద మొత్తంలోనే డబ్బులు ఖర్చు చేసింది. కానీ చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడ రేవుల్లో పెట్టుబడి పెట్టడంతో.. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనామా ప్రభుత్వానికి కూడా అది నచ్చకపోవడంతో.. తాజాగా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈక్రమంలోనే యూఎస్‌కు చెందిన 40 శాతం కంటెనర్లు పనామా కాలువలో ప్రయాణిస్తుండగా.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com