ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందువలనే రైల్వేలో ఆ రెండు టిక్కెట్ల మధ్య తేడాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 05:47 PM

దేశంలో రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. గతంలో ప్రయాణికులు టికెట్లను కౌంటర్ వద్ద పోటీపడి నిలబడి, కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం డిజిటల్ వ్యవస్థ పెరగడంతో ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. అయితే ఈ కొత్త ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా కౌంటర్ టిక్కెట్లతో పోల్చితే కొంచెం ఖరీదైనవిగా మారాయని, అనేక మంది ప్రయాణికులు అనుకుంటున్నారు.కౌంటర్ ద్వారా టికెట్ తీసుకున్న ప్రయాణికులు, ఆన్‌లైన్ టిక్కెట్ల ఎక్కువ ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల సంజయ్ రౌత్ (శివసేన) రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయన ఆన్‌లైన్ టిక్కెట్లు, కౌంటర్ టిక్కెట్ల కంటే ఎక్కువ ధరలు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు.


దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.ఆన్‌లైన్ టిక్కెట్లు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా మాత్రమే బుక్ చేయవచ్చు. ఇది ఒక అధికారిక వెబ్‌సైట్, యాప్. ఇది టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. కానీ ఈ సౌకర్యాన్ని అందించడానికి IRCTC చాలా ఖర్చులు చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, వెబ్‌సైట్ నిర్వహణ, సర్వర్ విస్తరణ, సెక్యూరిటీ మెజర్లు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులన్నింటిని భర్తీ చేయడానికి IRCTC సౌకర్య రుసుం వసూలు చేస్తుంది.దీంతోపాటు రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి వస్తువులు సేవల పన్ను కూడా వసూలు చేస్తుంది. ఇది భారత ప్రభుత్వానికి చేరుతుంది. దీంతో ఆన్‌లైన్ టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa