ఎన్టీఆర్ జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాధి పాకింది. గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీఫామ్లో మూడ్రోజుల్లో 11వేల కోళ్లు మృతి చెందాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు,చికెన్ షాపులు,కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని అక్కడి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులపాటు చికెన్కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరువూరు పరిసర ప్రాంతాల్లో 15రోజుల నుంచి ఇప్పటికే కొన్ని పౌల్ట్రీఫాంలల్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. లక్షల్లాది రూపాయల పెట్టుబడుపెట్టి క్షణాల్లో కళ్లముందే కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |