ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కేరళలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 05:08 PM

దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ(బుధవారం) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈరోజు నుంచి 11 ఆలయాలను పవన్‌కల్యాణ్‌ దర్శించుకోనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్‌ సందర్శిస్తున్నారు. 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు.


ఈరోజు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సందర్శనలో పవన్‌తో పాటు కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని దర్శించి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్‌, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com