ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో కొత్త రూ.50 నోట్లు విడుదల

national |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 08:04 PM

ఆర్‌బీఐ) బుధవారం రోజున కీలక ప్రకటన చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఉన్న నోట్లు మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతోనే ప్రచారంలో ఉన్నాయి.ఆయన స్థానంలో సంజయ్‌ మల్హోత్రా గతేడాది డిసెంబర్‌లో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహాత్మ గాంధీ సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ బుధవారం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com