ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వల్లభనేని వంశీ దుర్భాషలాడారని మంత్రి వాసంశెట్టి ధ్వజమెత్తారు. ఆయనకు జైలే సరైన స్థానం అంటూ ఆగ్రహించారు. మానవ జన్మకే మచ్చ తెచ్చిన వంశీకి, రెచ్చిపోతున్న అతని అనుచరులకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో వైసీపీ మూకలు అరాచక చర్యలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జగన్తో కలిసి విధ్వంసం సృష్టించిన వంశీ జైల్లోనే ఉండాలని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి విధ్వంసం సృష్టించిన వంశీకి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి అన్నారు. దోచుకున్న కోట్ల రూపాయలు కక్కిస్తామని చెప్పుకొచ్చారు. వంశీ చేతుల్లో కిడ్నాప్కు గురైన సత్యవర్ధన్ కుటుంబసభ్యులకు తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. వైసీపీలో ఇలాంటి వారెందరో ఉన్నారని, వారిని గుర్తించి మరోసారి అరాచకాలకు పాల్పడుకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |