ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో పర్యటించనున్న లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 02:08 PM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం రాత్రి విశాఖ నగరానికి రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 9.30 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గల సన్‌రే విలేజ్‌ రిసార్ట్స్‌లో వెళతారు. అక్కడ జస్టిస్‌ డి.రమేష్‌ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం 11.30 గంటలకు బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మధ్యాహ్నం 12.55 గంటలకు హైదరాబాద్‌ వెళతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa