ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం అదంరికీ తెలిసిందే. మొదటి రెండు రోజులు ఫ్రాన్స్ వెళ్లిన ఆయన.. గురువారం రోజు అమెరికాకు చేరుకున్నారు. ఈక్రమంలోనే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. ఆపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుటుంబాన్ని కూడా కలిశారు. ఈక్రమంలోనే మస్క్ ముగ్గురు పిల్లలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులను అందజేశారు. చిన్నారులు సైతం చాలా సంతోషంగా వాటిని తీసుకుని తెగ మురిసిపోయారు. మరి వారికి అంతనా నచ్చిన ఆ బహుమతులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రెండ్రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రోజు అమెరికాకు చేరుకున్నారు. ఈక్రమంలోనే అక్కడి వాళ్లు ఘన స్వాగతం పలికి.. బ్లేయర్ హౌస్లో మోదీకి బస ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆయన ట్రంప్తో భేటీ కాగా.. తాజగా టెస్లా అధినేత మోదీని కలిసేందుకు వెళ్లారు. తన ప్రేయసితో పాటు ముగ్గురు పిల్లలను తీసుకుని నేరుగా బ్లేయర్ హౌస్కు వెళ్లగా.. ప్రధాని వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆపై మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈక్రమంలోనే ప్రధాని మోదీ.. మస్క్ ముగ్గురు పిల్లలు అయిన ఎక్స్, స్ట్రైడర్, అజూర్లతో సరాదాగా మాట్లాడారు. అలాగే వారికోసం తాను భారత్ నుంచి తెప్పిన ప్రత్యేక బహుమతులను అందజేశారు. చిన్నారుల్లో జ్ఞానం పెంపోందేలా మూడు పుస్తకాలను అందజేశారు. అందులో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ రచించిన "ది క్రెసెంట్ మూన్", ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్, పండింట్ విష్ణు శర్న రచించిన పంచతంత్ర పుస్తకాలు ఉన్నాయి. వీటిని తీసుకున్న మస్క్ పిల్లలు సైతం వాటిని పట్టుకునే కనిపించారు. అందులో ఏమున్నాయో తెలుసుకునేందుకు వారు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను నేరుగా ప్రధాన మంత్రే ఎక్స్ వేధికగా పోస్ట్ చేశారు. అందులో మోదీ పిల్లలకు బహుమతులు ఇవ్వడం, మస్క్ కుటుంబంతో కలిసి మాట్లాడడం కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చిన్నారులు ఆసక్తిగా ఆ పుస్తకాలను తెరిచి చూడడం కూడా మనం గమనించవచ్చు.
ఇదంతా ఇలా ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్కు మొత్తం 12 మంది పిల్లలు. తన మాజీ భార్య జస్టిన్ వల్ల మస్క్కు కల్గిన మొదటి బిడ్డ కేవలం 10 వారాల వయసులోనే ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్తో ప్రాణాలు కోల్పోయింది. ఈ జంట విడాకులు తీసుకునే ముందు ఐవీఎఫ్ ద్వారా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఇద్దరు (గ్రిఫిన్ మరియు వివియన్) కవలలు కాగా.. తర్వాత ముగ్గురు పుట్టారు. వారే సాక్సన్, డామియన్, కై.
మస్క్ ఆ తర్వాత మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. వారిలో సంగీతకారుడు గ్రిమ్స్ ఒకరు. ఇతడి అసలు పేరు క్లైర్ బౌచర్. మరో ఇద్దరు "ఎక్స్" ఎక్స్ ట్రా డార్క్ సైడ్రేల్, "టౌ" టెక్నో మెకానికస్. వీరితో పాటే ప్రస్తుతం మోదీ వద్ద బహుమతులు తీసుకున్న ముగ్గురు పిల్లలు. ఇలా మొత్తంగా 12 మందికి జన్మనివ్వగా.. ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 11 మంది తన వద్ద ఉంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa