ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్సిల్ ఎత్తినా వ్యాయామం చేసినట్లే..: సునీతా విలియమ్స్

international |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 10:02 PM

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 8 నెలలుగా అంతరిక్షంలోనే ఉంటున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు మార్చి 19వ తేదీన భూమ్మీదకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే వీరిద్దరూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇన్ని రోజులు గ్రావిటీ వద్దే ఉండడం వల్ల భూమ్మీదకు వచ్చాకా పెన్సిల్ లేపినా వ్యాయామం చేసినట్లే అవుతుందని వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


గతేడాది జూన్ 6వ తేదీన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు రోదసిలోకి వెళ్లారు. 8 రోజుల మిషన్‌లో భాగంగా.. బోయింగ్ స్టాల్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే జూన్ 14నవ తేదీనే వీరు తిరిగి రావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారు ఇంటికి తిరిగి వచ్చేందుకు కుదరలేదు. వాటిని ఎంతగా బాగు చేయాలని ప్రయత్నించినా అవన్నీ విఫలమయ్యాయి. ఇలా గత 8 నెలలుగా ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉంటున్నారు.


  అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరిని భూమ్మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు చెబుతూ.. వారిని త్వరగా ఇంటికి తీసుకురావాలని చెప్పగా.. ఆయన కూడా స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్ ద్వారా వీరిని తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా వచ్చే నెల అంటే మార్చి 19వ తేదీనే వీరిద్దరినీ వెనక్కి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు సైతం దీన్ని ధ్రువీకరించారు.


ఈక్రమంలోనే రోదసి నుంచే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా బుచ్ విల్‌మోర్ మాట్లాడుతూ.. గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పారు. 8 నెలల పాటు అక్కడే ఉండడం వల్ల గురుత్వాకర్షణ కల్గిన వాతావరణంలోకి రావాలంటే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలానే సమయం పట్టవచ్చని అన్నారు. శరీరం అంతా భారమైన భావన కల్గుతుందని.. పెన్సిల్ ఎత్తినా వ్యాయామం చేసినట్లే అవుతుందని వెల్లడించారు.


స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు.. భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరం అంవుతూ ఉంటారు. వాళ్లు నడవడం, కూర్చోవడం వంటివి చేసేందుకు కూడా సమయం పడుతుంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే సునీతా విలియమ్స్ చెప్పారు. తాను కూర్చోవడం, నడవడం మర్చిపోయానని.. గుర్తు తెచ్చుకున్నా అది గుర్తు రావడం లేదని వెల్లడించారు. చూడాలి మరి వీరి భూమ్మీదకు వచ్చాకా ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa