AP: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని కుటుంబసభ్యులపై ఆదివారం దాడి జరిగింది. ఆమె మావయ్య విడదల లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నంలో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు, రజినీ సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa