ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం,,,, షాపులోకి దూసుకెళ్లిన వాహనం

Crime |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 10:14 PM

జనగామ జిల్లా పాలకుర్తిలో ఇవాళ ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న షాపులోకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనలో ఆర్టీసీ బస్సు, బైక్, షాపు ధ్వంసమయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో హాస్పిటల్ తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం పాలకుర్తి మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


అతివేగంగా వచ్చిన ఓ లారీ అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అదే స్పీడ్‌తో ఓ బైక్‌ను కూడా ఢీకొట్టి పక్కనే ఉన్న మెుబైల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సాయంతో షాపులోకి చొచ్చుకుపోయిన లారీని పోలీసులు బయటికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం..


పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు కారులో కుటుంబ సభ్యులు బయలు దేరారు. అయితే వారు వెళ్తున్న కారును రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ముగ్గురు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.


మృతులు షేక్ నజీమా (50), ఆమె కుమారులు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) గా పోలీసులు వెల్లడించారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు ముమ్మరం చేశారు. మృత‌దేహాల‌ను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటలో మరికొందరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి త‌ర‌లించారు. ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ చేప‌ట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa