ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ వివాదంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం,10మందికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 09:15 AM

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మినాయుడు వలస గ్రామానికి చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పట్నుంచో భూ వివాదం నడుస్తోంది. అయితే ఆదివారం రాత్రి ఇదే విషయమై వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. కాసేపటి తర్వాత సదరు ఫ్యాన్ పార్టీ కార్యకర్త తమ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులతో కలిసి వీరంగం సృష్టించాడు. దీంతో టీడీపీ కార్యకర్తకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు నిలబడ్డాయి.దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన ఇరువర్గాల కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. పరస్పరం దాడుల్లో ఇరువర్గాలకు చెందిన 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాధితులను రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొమ్మినాయుడు వలసలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa