ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోనాలు సమర్పించిన మాజీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 05:42 PM

పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఘ‌నంగా నిర్వహిస్తున్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహా ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు  ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. గ్రామ మహిళలతో కలిసి ఉషాశ్రీ చ‌ర‌ణ్ నెత్తిన బోనం పెట్టుకుని గ్రామ పురవీధుల తిరుగుతూ బోనాలు సమర్పించారు.  అలానే వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (మంగ‌ళ‌వారం)  విజయవాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. రేపు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో... కూటమి ప్రభుత్వ అక్రమ కేసులలో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa