ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాను శత్రువులా చూడొద్దు.. గ్రెస్ మాజీ ఛైర్మన్ శామ్ పిట్రోడా

national |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 08:31 PM

కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని, వారి నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం వచ్చిందన్న పిట్రోడా... ఇకనైనా భారత్‌ తన వైఖరి మార్చుకొని శత్రువులా చూడటం మానుకోవాలని ఆయన సూచించారు. ఓ ఇంటర్వ్యూలో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ.. చైనా పట్ల భారత్‌ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య వైరాన్ని పెంచుతోందని అన్నారు.


‘‘చైనా పట్ల భారత్ వైఖరి ముందు నుంచి ఘర్షణాత్మకంగానే ఉంది.. మనం అనుసరిస్తోన్న విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోంది.. భారత్‌కు సరైన మద్దతు దక్కడం లేదు. ఇప్పటికైనా భారత్‌ వైఖరిలో మార్పు రావాలి.. ఇది కేవలం చైనాకు మాత్రమే కాదు ఇతర దేశాలకు వర్తిస్తుంది. అయినా చైనా నుంచి ఏమి ముప్పుందో నాకు అర్థం కావడం లేదదు. చైనాను అమెరికా తరచూ శత్రువుగా పేర్కొంటూ.. భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది.. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత వేగంగా... పేద దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.. మరోవైపు, అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు తగ్గుతోంది.. ఈ దేశాల జనాభాలో వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు..


ఇక, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత ఎక్కువగా ఉంది.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనం ముందుకెళ్లాలి’ అని పిట్రోడా సూచించారు. అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలు సంబంధాలు, కమ్యూనికేషన్ పెంచుకుని. అవసరమైన సమయంలో ఒకరొకరు సహకారం అందించుకోవాలని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చైనా అంటే అమితమైన ప్రేమ అని, అందుకు పిట్రోడా వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడింది.


‘మన భూభాగంలో 40,000 చదరపు కిలోమీటర్లను చైనాకు అప్పగించిన వారికి ఇప్పటికీ ఆ దేశం నుంచి ఎటువంటి ముప్పు కనిపించడం లేదు.. కాంగ్రెస్ పార్టీకి చైనా పట్ల ఉన్న అమితమైన అభిమానం వెనుకున్న రహస్యం 2008 కాంగ్రెస్-చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య జరిగి అవగాహన ఒప్పందంలో దాగి ఉంది’ అని బీజేపీ జాతీయ అధికారి ప్రతినిది తుహిన్ సిన్హా ఆరోపించారు.


అమెరికాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతోన్న ఉద్రిక్తతల నివారణకు సాయం చేస్తానంటూ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను భారత్ సున్నితంగా తిరస్కరించింది. పొరుగు దేశాలతో ఉన్న వివాదాల పరిష్కారం కోసం భారత్‌ ఎప్పుడూ ద్వైపాక్షిక చర్చలనే మార్గంగా ఎంచుకుంటుందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి స్పష్టం చేశారు. దీంతో శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పిట్రోడా వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇది కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేయగా.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa