ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు,,,హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌

Crime |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 11:49 PM

హైదరాబాద్ నగరంలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2021లో అమర్‌దీప్‌తో పాటు మరికొంత మంది కలిసి కంపెనీ పెట్టారు. హైదరాబాద్ నగరం నుంచి ఈ సంస్థ కార్యకలపాలు సాగించేది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు తెరతీసింది. బ్రిటానియా, అమెజాన్, గోద్రెజ్ లాంటి సంస్థల్లో పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకు డిపాజిట్‌ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11 నుంచి 22 శాతం రాబడిని ఇస్తామని సంస్థ ప్రతినిధులు నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. దేశవ్యాప్తంగా 6,979 మంది నుంచి రూ.1700 కోట్లు వసూలు చేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనేరూ. 850 కోట్లు వసూలు చేశారు. డిపాజిటర్లకు రాబడిని అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను సేకరించారు.


సేకరించిన డిపాజిట్లను కాయిన్ ట్రేడ్, క్రిప్టో కరెన్సీ, ఆర్డీబీ, ఎంబీఆర్ దుబాయ్, కాపిటల్ టెక్సోల్, గోపాల్, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్, ఇండియా ఓకే రిసార్ట్స్, ప్రిస్టేజ్, ఫాల్కన్ ఇంటర్నేషనల్, ఒజాస్, లోక్ వెల్ఫేర్, స్వస్తిక్ పేరుతో ఫాల్కన్‌కు అనుబంధంగా 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేళశారు. ఆ డబ్బులను ఆయా కంపెనీలకు బదిలీ చేశారు. 2025 జనవరి 15న నాటికి ఈ స్కీమ్‌ ఆపేసి బోర్డు తిప్పేశారు. డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసి పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ దుబాయ్ పారిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, నిందితులు గతంలో 'బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ' అనే కంపెనీ ద్వారా మల్టీ-లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌తో ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు 2022లో చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa