తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను రిలీజ్ చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు పేమెంట్ చేయాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ను సంప్రదించండి.ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. ఫిబ్రవరి 21న మ.3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్లకు సంబంధించినన మే నెల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa