గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త వినిపించారు. రేషనలైజేషన్ ప్రక్రియలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రతపై అనవసరమైన అపోహలు నమ్మవద్దని సూచించారు.ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులను తొలగించవచ్చనే ప్రచారం జరుగుతుండగా, మంత్రి ఈ వదంతులను ఖండించారు. సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఏ ఉద్యోగినీ తొలగించబోమని మంత్రి స్పష్టం చేశారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి సమావేశమై వారి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పదోన్నతులు, పీఆర్సీ వంటి అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావించగా, సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.సచివాలయాలను మూడు కేటగిరీలుగా ప్రభత్వం విభజించింది. ఉద్యోగుల సమర్థ వినియోగం కోసం, ప్రభుత్వం సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించింది. A కేటగిరీ: 2,500 మంది లోపు జనాభా ఉన్న సచివాలయాలు, B కేటగిరీ: 2,500 నుంచి 3,500 మంది జనాభా గల సచివాలయాలు, C కేటగిరీ: 3,500 మందికి పైగా జనాభా గల సచివాలయాలు ఉంటాయి.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఎక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నందున, జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపునకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.తాజాగా మంత్రి మహిళా పోలీసులపై కీలక ప్రకటన చేశారు. కొన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నాయంటూ త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. మహిళా పోలీసుల విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భద్రతపై ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోతారన్న భయాలకు తావులేదని మరోసారి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa