ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 08:56 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్ తదితరులు పవిత్ర స్నానాలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ కుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన సందర్భంగా ఆయన చొక్కా పూర్తిగా తీసేసి, కేవలం ధోతీపై నీళ్లలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa