ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకర్లు రుణాల మంజూరులో ప్రగతి సాధించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:48 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను మార్చి 15లోపు వందశాతం పూర్తిచేయాలని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి గనియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ సుబ్బారెడ్డి, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ రవీంద్రకుమార్‌, స్టేట్‌బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ సూర్యప్రకాష్‌తోపాటు వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రుణాల మంజూరులో కొంతమేర ప్రగతి సాధించారని, పెండింగ్‌ లక్ష్యాలను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం, పీఎం సూర్యఘర్‌, స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా, పీఎంఈజీపీ, ముద్రా లోన్స్‌ తదితర పథకాలకు రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నారని, వాటిని కూడా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల శ్రేయస్సుకు ప్రభుత్వం మంజూరుచేసిన రుణాలు అందించి తోడ్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నాబార్డు ద్వారా 2025-26కు సంబంధించి పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ కింద రూ.11,972కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa