ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యాహ్న భోజనంలో కొన్ని ఆహారాలు అస్సలు తినకండి

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:50 PM

ప్రతి ఒక్కరికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఎంత ముఖ్యమో, మధ్యాహ్న భోజనం కూడా అంతే ముఖ్యం. అయితే, లంచ్‌లో కొన్ని ఆహారాలు తింటే అవి కచ్చితంగా బరువు పెరిగేలా చేస్తాయి. కొన్ని ఆహారాల్లో కేలరీలు, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు తెలియకుండానే బరువు పెరుగుతాం. కొన్ని ఆహారాల్ని అధికంగా తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మధ్యాహ్న భోజన సమయంలో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.


  బాగా వేయించిన ఆహారాలు


పూరీలు, పకోడీలు, వేయించిన స్నాక్స్ వంటి ఆహారాల్ని లంచ్ సమయంలో తినకండి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటితో పాటు వేయించిన కూరలు, డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా నో చెప్పండి. ఈ ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి.


బంగాళదుంప కూర


బంగాళదుంపలో పిండి పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి సాయపడతుంది. అందుకే బంగాళదుంపలో ఎక్కువ పరిమాణంలో తినకూడదు. మితంగా తింటే మేలు. ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పేస్ట్రీలు లేదా స్వీట్లు


భోజనం తర్వాత స్వీట్లు లేదా పేస్ట్రీలు తినడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు మంచిది కాదంటున్నారు నిపుణులు. వీటిలో అధిక మొత్తంలో చక్కెర, ట్రాన్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. అందుకే పేస్ట్రీలు లేదా స్వీట్లు తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.


వైట్ రైస్


​తెల్ల అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా అన్నంలో ఫైబర్ ఉండదు. దీంతో ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ప్రభావితం అవుతాయి. అన్నం బదులు బ్రౌన్ రైస్, క్వినోవా, లేదా తృణధాన్యాలతో చేసిన ఆహారాలు తినడం మేలు అంటున్నారు నిపుణులు.


నెయ్యి, వెన్న ఎక్కువగా వాడటం


ఇక, చాలా మంది భోజనంలో నెయ్యి లేదా వెన్న ఎక్కువగా వాడుతుంటారు. కొందరు పచ్చడిలో నెయ్యి కలుపుకుని తింటారు. మరికొందరు రోటీ లేదా పరాఠాపై నెయ్యి, వెన్న వాడుతుంటారు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల కేలరీలు పెరుగుతాయి. కేలరీలు ఎక్కువైతే బరువు పెరుగుతారు. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగే ప్రమాదముంది.


షుగరీ డ్రింక్స్


చాలా మంది భోజనంతో పాటు షుగరీ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు తాగుతుంటారు. అయితే, వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. శరీరంలోకి చక్కెర ఎక్కువైతే, దానిని బర్న్ చేయడం చాలా కష్టం. ఇవి కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. అంతేకాకుండా వీటిలో పోషకాలేమీ ఉండవు. కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేయడమే కాకుండా మీ బరువును పెంచుతాయి.


ఇవి కూడా డేంజర్


* ప్రాసెస్డ్ బ్రెడ్, చీజ్ బరువు పెరగడానికి సాయపడతాయి. అంతేకాకుండా వాటిల ఉండే ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.


* ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన ఆహారాలు కూడా ఆరోగ్యానికి హానికరం. వీటిలో ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి తింటే బరువు పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా ముప్పులో పడుతుంది


* ఐస్‌క్రీమ్స్, మసాలా ఆహారాలు వంటి వాటి కూడా దూరంగా ఉండాలి. లంచ్‌లో ఎక్కువగా తృణధాన్యాలు, ఓట్స్‌తో చేసిన ఫుడ్స్, పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మేలు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com