ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 12:32 PM

పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.80,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.390 పెరగడంతో రూ.88,040లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.బంగారం ధరలను ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, దేశీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. సుంకాలపై ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక లోటులు, డీడాలరైజేషన్, ట్రంప్ వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల వంటివి అమెరికా వాణిజ్య విధానాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రపంచ మార్కెట్ కదలికలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa