ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ పార్వతమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 04:10 PM

పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్ల గ్రామదేవత శ్రీ పార్వతమ్మ అమ్మవారిని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గురువారం దర్శించుకున్నారు. అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి జాతరలో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు. అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. అమ్మవారి కరుణ నియోజకవర్గంలో ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. జన సైనికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa