ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను మాట్లాడిన ప్రతి మాటకూ ఆధారాలున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 11:45 AM

ఫైబర్‌నెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌పై ఆ సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి చేసిన రాజద్రోహం ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ కుమార్‌లను వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. గురువారం నాడుఫైబర్‌నెట్‌ ఎండీ దినేశ్‌కుమార్‌పై సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు శుక్రవారంనాడు పత్రికల్లో పతాకస్థాయిలో ప్రచురితం కావడంతో.. ఏం చేయాలో తేల్చుకోలేక ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు. దీంతో.. అసలేం జరుగుతుందనే దానిపై వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను మంత్రి బీసీ జనార్దనరెడ్డికి అప్పగించారు.ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే శుక్రవారమే మంత్రి బీసీ జనార్దనరెడ్డి రంగంలోకి దిగారు.


ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే నేరుగా మీడియా ముందు ఫైబర్‌నెట్‌ ఎండీ దినేశ్‌కుమార్‌ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారంటూ జీవీ రెడ్డిని మంత్రి అడిగారు. గడచిన కొద్దినెలలుగా దినేశ్‌కుమార్‌ తనకు సహకరించడం లేదంటూ జీవీ రెడ్డి వివరించారు. తాను మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటకూ ఆధారాలున్నాయని ఆయన మంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో వాట్సప్‌ మెసేజ్‌ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చేశారని జీవీరెడ్డి గుర్తు చేశారు. అసలు నియామక పత్రాలు లేని 410 మందిని తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలూ లేనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక తొమ్మిది నెలలుగా వారిని కొనసాగిస్తూనే జీతభత్యాలు చెల్లిస్తున్నారని ఎండీపై జీవీ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఇన్‌కమ్‌టాక్స్‌, జీఎస్టీ అంశాలపైనా జీవిరెడ్డి తన వాదనలు వినిపించారు. తాను ఇప్పటికే.. తన వాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్‌కు వెల్లడించానని జీవీ రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. ఫైబర్‌నెట్‌ ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఎండీ దినేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని మంత్రికి సూచించారు. వీటన్నింటిపై ఆధారాలతో కూడిన సంజాయిషీని ఇవ్వాలని జీవీ రెడ్డిని మంత్రి జనార్దనరెడ్డి కోరారు. దీంతో.. జీవీ రెడ్డి తన వద్దనున్న ఆధారాలతో కూడిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నానికి మంత్రికి అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa