చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఆ కంపెనీ ఉత్పత్తులను వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో తాము ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు తన మిత్ర దేశాలకు కూడా హువావే టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులను వాడరాదంటూ అమెరికా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో హువావే కంపెనీ అమెరికాపై దావా వేసింది. టెక్సాస్ కోర్టులో కేసు నమోదు చేసింది. ఫెడరల్ ఏజెన్సీలు హువావే ఉత్పత్తులను వాడరాదంటూ అమెరికా నిషేధం విధించడాన్ని ఆ కంపెనీ సవాల్ చేసింది. తమ ఉత్పత్తుల్లో లోపం ఉన్నట్లు అమెరికా నిరూపించలేకపోయిందని, చైనా ప్రభుత్వంతోనూ తమకు లింకులు లేవని హువావే చైర్మన్ ఇటీవల షెంజెన్లో జరిగిన ఓ మీట్లో వెల్లడించారు. కానీ అమెరికా మాత్రం ఆ ఉత్పత్తులను నిషేధిస్తున్నది. తమ ఉత్పత్తులపై ప్రజల్లో అమెరికా తప్పుడు అభిప్రాయాలను చేరవేస్తున్నదని, తమ కంపెనీ సర్వర్లను హ్యాక్ చేస్తున్నదని హువావే చైర్మన్ ఆరోపించారు. హువావే ఉత్పత్తులను వాడకూడదంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా తమ టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa