మాజీ ముఖ్యమంత్రి జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరు. ఇప్పటికే ప్రజలు దుస్తులూడదీసి ఆయనను ఇంట్లో కూర్చోబెట్టారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తారనే భయంతో జగన్ అసెంబ్లీకి రావడం లేదు. పోలీసులను బెదిరించి నీచ రాజకీయాలకు తెరలేపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దళితుడిని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా?’ అని మంత్రి కొల్లు రవీంద్ర అని ప్రశ్నించారు. శుక్రవారం గుడివాడ ఏలూరురోడ్డులోని ప్రజావేదికలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారన్నారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పినా జగన్ తన రాజకీయ స్వార్థానికి మిర్చి యార్డుకు వెళ్లారని అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. బూతులు మాట్లాడానికైతే నానీకి ఉద్యోగం అవసరమని, ప్రజాసేవ చేయడానికి అవసరం లేదని అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తాము ప్రజలకు జవాబుదారీగానే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన జిల్లా ఖ్యాతిని తిరిగి తీసుకొచ్చేందుకు తామంతా కష్టపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జనసేన జిల్లా కన్వీనర్ బండి రామకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa