ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన ఒక ఎమ్మెల్యే మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:02 PM

‘మీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ విషయాన్ని మరచి మరోసారి ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాల’ని వైసీపీ జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ హితవు పలికారు. జగన్‌రెడ్డికి భద్రత తగ్గించారని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఈ మేరకు శుక్రవారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మిర్చి రైతులకు మద్దతు ధర లేదని గుంటూరు మిర్చి యార్డులో నిరసన చేయాలని జగన్‌రెడ్డి వెళ్లడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందన్న సంగతి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వెళ్లారే తప్ప... అక్కడ ఏం వెలగబెట్టారో చెప్పాలని నిలదీశారు.అధికారంలో ఉన్నపుడు మిర్చి రైతులకు రూపాయి మేలు చేశారా అని ప్రశ్నించారు. దౌర్జన్యంగా మిర్చి యార్డులోకి వెళ్లి అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వైసీపీ అధినేత జగన్‌రెడ్డికి సెక్యూరిటీ తీసేశామంటున్నారనీ, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa