ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలకు ఈ ఆహారాల్ని పొరపాటున కూడా ఇవ్వకండి

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 11:05 PM

పాలు ఆరోగ్యానికి పౌష్టికాహారం అంటారు. పాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు. పాలలో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వీటితో పిల్లల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. ఎదిగే పిల్లలు పాలు తాగితే మంచిదంటారు. పాలు రోజూ తాగడం వల్ల పిల్లల్లో ఇమ్యూనీటి పవర్ పెరుగుతుంది. పాలు పిల్లల మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పాలలో విటమిన్ డి ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం. పిల్లల దంతాల ఆరోగ్యానికి కూడా పాలు చాలా కీలకం.


అందుకే పిల్లలకు ఉదయం పూట లేదా సాయంత్రం పడుకునే ముందు ఒక గ్లాస్ ఇవ్వడం మంచి అలవాటు. ​పాలు తాగితే ఎన్నో పోషకాలు శరీరానికి లభిస్తాయి. పాలలో కాల్షియం, ప్రోటీన్లు, సహజ కొవ్వు, కేలరీలు, విటమిన్ బి2, పొటాషియం, విటమిన్ డి ఉంటాయి. పాలను తాగడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే, పాలతో పాటు కలిపి కొన్ని ఆహారాలను పిల్లలకు ఇవ్వకూడదు. చాలా మంది తల్లిదండ్రులు తెలిసో లేదా తెలియకు పిల్లల చేత పాలు తాగించడానికి కొన్ని ఆహారాలను వారికి ఇస్తారు. ఇదే వాళ్లు పెద్ద తప్పు. పిల్లలకు పాలతో పాటు ఎలాంటి ఆహారాలు ఇవ్వకూడదో తెలుసుకుందాం.


కారం, ఉప్పుతో కూడిన స్నాక్స్


​పిల్లలు పాలు తాగడానికి మొండికేస్తారు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియకు వారికి ఇష్టమైన చిరుతిండిని పాలతో పాటు లేదా పాలు తాగిన వెంటనే ఇస్తారు. అయితే ఇలా చేయడం మంచి కాదంటున్నారు నిపుణులు. చిప్స్, కుర్కురే వంటి ఉప్పు, కారంతో కూడిన స్నాక్స్ పిల్లలకు ఇవ్వడం హానికరం. ఈ చిరుతిండులు తిని పాలు తాగడం వల్ల జీర్ణసమస్యలు తలెత్తే ప్రమాదముంది. పిల్లల జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. వీటిని ఇవ్వడం వల్ల వారి జీర్ణ సమస్యలతో పాటు పేగు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


పుల్లని పండ్లు


​నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లను కూడా పాలతో కలిపి పిల్లలకు ఇవ్వకూడదు. పిల్లలకు పాలతో లేదా పాలు తాగిన తర్వాత సిట్రస్ పండ్లను ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే ఈ పుల్లని పండ్లలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పాలలో ఉండే ప్రోటీన్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీంతో పాలు జీర్ణం కావడం చాలా కష్టమవుతుంది. ఈ ఫుడ్ కాంబినేషన్ వల్ల గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి వంటి కడుపు సమస్యలు పిల్లలకు వచ్చే ప్రమాదముంది.


ద్రాక్ష


పిల్లలకు పాలతో పాటు ద్రాక్షను ఇచ్చే పొరపాటు కూడా ఎప్పుడూ చేయకండి. తాగిన గంటలోపు ద్రాక్ష తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నిజా ద్రాక్షలో ఉండే విటమిన్ సి, ఫ్రూట్ యాసిడ్ పాలలో కలిసినప్పుడు అందులో ఉండే ప్రోటీన్ గడ్డకడుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది.


పుచ్చకాయ


పిల్లలకు ఎప్పుడూ పాలతో కలిపి లేదా పాలు తాగిన వెంటనే పుచ్చకాయ ఇవ్వకూడదు. నిజానికి పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు వాటిని జీర్ణం చేసుకోవడం పిల్లలకు చాలా కష్టమవుతుంది. పాలు, నీరు కలిసినప్పుడు పొట్టలో అది గడ్డలా పేరుకుపోయే ప్రమాదముంది. దీనివల్ల కడుపు నొప్పి, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది.


చికెన్, మటన్


చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పిల్లలు పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్‌ లేదా మటన్‌కు భిన్నంగా ఉంటుంది. పాలు, చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్‌ జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది జీర్ణప్రక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్‌ ఎక్కువకాలం తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com