ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం రానున్నారు. సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టరులో శ్రీశైలం వస్తారు. శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. రాత్రికి శ్రీశైలంలో గవర్నర్ బస చేస్తారు. మంగళవారం ఉదయం శ్రీశైలం నుంచి విజయవాడకు బయలుదేరి వస్తారు. కాగా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరోవరోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆది దంపతులు సాయంత్రం పుష్పపల్లకిలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పపల్లకిలో గ్రామోత్సవం నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa