ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ, చంద్రబాబుల కుట్రే ఎస్సీ వర్గీకరణ అంశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 10:43 AM

ఎస్సీ వర్గీకరణ సరికాదని మాల సంఘాల నాయకులు కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన మహాసభ మాలల జేఏసీ కన్వీనర్‌ యాట ఓబులేసు అధ్యక్షతన నిర్వహించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కుట్ర వల్ల ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిందని అన్నారు.  గ్రామ స్థాయిలో వర్గీకరణకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావాలని అన్నారు.మాలల శక్తిగా తయారు కావాలని, అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఉద్యమం ఉధృతం దాలుస్తుందన్నారు. సభలో ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌, విశ్రాంత అధికారి పీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa