ఉమ్మడి కృష్ణా - గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గుంటూరు పట్టణంలోని లూర్ధు హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద గురువారం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హై స్కూల్ కు కుటుంబ సమేతంగా చేరుకున్న ఆయన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |